ట్రాక్టర్ లో కుషన్డ్ సోఫాపై రాహుల్, వారెవా ! కేంద్ర మంత్రి ‘పురి’ సెటైర్ !
రైతు చట్టాలకు నిరసనగా పంజాబ్ లో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..ఆ ట్రాక్టర్ పై మెత్తని కుషన్డ్ సోఫామీద కూర్చున్న ఫోటో కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురిని 'ఆకర్షించింది'.
రైతు చట్టాలకు నిరసనగా పంజాబ్ లో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..ఆ ట్రాక్టర్ పై మెత్తని కుషన్డ్ సోఫామీద కూర్చున్న ఫోటో కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురిని ‘ఆకర్షించింది’. ఇదేం నిరసన అని ఆయన ఎత్తిపొడిచారు. ‘కుషన్డ్ సోఫాస్ ఆన్ ట్రాక్టర్ ఈజ్ నాట్ ఎ ప్రొటెస్ట్’ అని ట్వీట్ చేశారు. ఆ ఫోటోలో రాహుల్ పక్కన ఉంచిన మినరల్ వాటర్ బాటిల్, ఆయన కూర్చున్న చిన్నపాటి సోఫా, కాళ్లకు ధరించిన బ్రాండెడ్ షూస్ ని మార్కింగులతో సహా చూపారు. ఇది మన రైతులను తప్పుదారి పట్టించే ‘ప్రొటెస్ట్ టూరిజం’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రైతులు విద్యావంతులని, ఏది ఒప్పో, ఏది కాదో తెలుసుకోగలిగే తెలివిమంతులని పౌర విమాన యాన శాఖ మంత్రి అయిన ఆయన అన్నారు. పంజాబ్ లోని మోగాలో నిన్న జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో రాహుల్ తో బాటు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ కూడా పాల్గొన్నారు.
The 'protest' launched by Congress is a political protest by those whose vested interests are hurt by the #FarmBills.
Cushioned sofas on tractors is not a protest.
It is ‘Protest Tourism’ to misguide our farmers who are educated & intelligent to see through this facade. pic.twitter.com/MiYz7IndYf
— Hardeep Singh Puri (@HardeepSPuri) October 5, 2020