శ్రావణి కేసు: పరారీలో ఆర్‌ఎక్స్ 100 నిర్మాత

టీవీ నటి శ్రావణి హత్య కేసులో విచారణ జరిపిన పోలీసులు.. నిందితులు సాయి, దేవరాజ్‌లను ఆదివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

శ్రావణి కేసు: పరారీలో ఆర్‌ఎక్స్ 100 నిర్మాత
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2020 | 1:16 PM

Sravani death case update: టీవీ నటి శ్రావణి హత్య కేసులో విచారణ జరిపిన పోలీసులు.. నిందితులు సాయి, దేవరాజ్‌లను ఆదివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దేవరాజ్ పెళ్లికి నిరాకరించడం, సాయి వేధింపుల వలనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక వీరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఈ మధ్యాహ్నం ఆ ఇద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఈ కేసుపై మాట్లాడిన వెస్ట్ జోన్ డీసీసీ ఏఆర్ శ్రీనివాస్‌ తల్లిదండ్రులు, సాయి.. శ్రావణిని వేధించినట్లు ఆధారాలు ఉన్నాయని అన్నారు. అలాగే సాయి, దేవరాజ్‌ ప్రమేయంపై ఆడియో కాల్స్, వీడియోలు ఉన్నాయని వెల్లడించారు. ఈరోజు నిందితులను రిమాండ్ చేస్తామని ఆయన తెలిపారు.

మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న మూడో వ్యక్తి, ఆర్‌ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి పరారీలో ఉన్నాడు. కేసుకు సంబంధించి సోమవారం విచారణకు రావాలని పోలీసులు అతడికి నోటీసులు పంపారు. ఇక ఇవాళ ఉదయం నుంచి అతడి ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమచారం.

Read More:

‘కౌన్ బనేగా’ గెలిచాక ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. నా భార్యతో విడాకుల వరకు వెళ్లా

సుశాంత్ కేసు.. మరో ఆరుగురిని అరెస్ట్‌ చేసిన ఎన్సీబీ