Molestation me in Dreams: రాత్రిళ్లు కల్లోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడు..! బిహార్‌ పోలీసుల ముందుకు విచిత్రమైన కేసు..!

Woman Complains: తనపై నిత్యం ఓ వ్యక్తి అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ వింత కేసు నమోదైంది. ఇందులో వింతేముంది అని అనుకుంటున్నారా... ఓ యువతి చేసిన ఫిర్యాదు చేసింది. మాంత్రికుడు రాత్రిళ్లు కల్లోకి వచ్చి తనపై అత్యాచారం...

Molestation me in Dreams: రాత్రిళ్లు కల్లోకి వచ్చి అత్యాచారం  చేస్తున్నాడు..! బిహార్‌ పోలీసుల ముందుకు విచిత్రమైన కేసు..!

Updated on: Jun 24, 2021 | 3:55 PM

తనపై నిత్యం ఓ వ్యక్తి అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ వింత కేసు నమోదైంది. ఇందులో వింతేముంది అని అనుకుంటున్నారా… ఓ యువతి చేసిన ఫిర్యాదు చేసింది. మాంత్రికుడు రాత్రిళ్లు కల్లోకి వచ్చి తనపై అత్యాచారం చేస్తున్నాడంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వింత సంఘటన బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. ఔరంగాబాద్‌ జిల్లా, కుద్వ పోలీస్‌ స్టేషన్‌ పరిథిలోని గాంధీ మైదాన్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ తన కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో గత జనవరి నెలలో ప్రశాంత్‌ చతుర్వేది అనే మాంత్రికుడిని ఆశ్రయించింది.

ఆ మాంత్రికుడు మహిళ కుమారుడి అరోగ్యం కోసం కొన్ని పూజలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే క్రమంలో 15 రోజుల తర్వాత ఆమె కొడుకు చనిపోయాడు.  కుమారుడి మరణం తర్వాత ఆమె ప్రశాంత్‌ ఉంటున్న కాళీ బరి ఆలయానికి వెళ్లింది. తన కుమారుడు ఎందుకు మరణించాడో చెప్పాలని నిలదీసింది. ఈ నేపథ్యంలో అతడు ఆమెపై అత్యాచారం చేయబోగా.. చనిపోయిన ఆమె కుమారుడు అడ్డుకున్నాడని ఓ మహిళ తెలిపింది.

ఇక అప్పటి నుంచి ప్రశాంత్‌ రాత్రిళ్లు ఆమె కల్లోకి వచ్చి అత్యాచారం చేసేవాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ప్రశాంత్‌ను విచారించగా ఆమె చెప్పేదంతా అబద్ధమని కొట్టిపాడేశాడు. ఆమెను ఎప్పుడూ కలుసుకోలేదని విచారణలో వెల్లడించాడు. నిందితుడికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవటంతో పోలీసులు.

ఇవి కూడా చదవండి : Crime News: ”ఒక్క రూపాయి ఇస్తే రూ.కోటి ఇస్తా”.. ఆన్‌లైన్‌లో మార్కెట్‌లో టీచర్‌కు కుచ్చు టోపీ.!

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. 24 రైళ్ల సర్వీసులు పొడిగింపు.. వివరాలు..

Loading...
Unable to load recommendations.
Follow Us