విమాన ప్రయాణికుల్లో ‘దురుసుగాళ్ళు’.. తస్మాత్ జాగ్రత్త ! సిబ్బందికి కొత్త రూల్స్ !

ఈ కరోనా కాలంలో  విమాన ప్రయాణికుల్లో కొందరు దురుసుగా ప్రవర్తిస్తుంటారని, అలాంటివారిపట్ల అప్రమత్తంగా ఉండాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. విమాన సిబ్బందికి సూచించింది. కేబిన్ క్రూ కి, ఇలాంటి ప్రయాణికులకు..

విమాన ప్రయాణికుల్లో దురుసుగాళ్ళు.. తస్మాత్ జాగ్రత్త ! సిబ్బందికి కొత్త రూల్స్ !

Edited By:

Updated on: Jun 25, 2020 | 1:26 PM

ఈ కరోనా కాలంలో  విమాన ప్రయాణికుల్లో కొందరు దురుసుగా ప్రవర్తిస్తుంటారని, అలాంటివారిపట్ల అప్రమత్తంగా ఉండాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. విమాన సిబ్బందికి సూచించింది. కేబిన్ క్రూ కి, ఇలాంటి ప్రయాణికులకు మధ్య తరచూ తగాదాలు, ఘర్షణలు జరుగుతున్న సంఘటనలు పెరిగిపోతున్న విషయాన్ని గుర్తించిన ఈ శాఖ..  సిబ్బంది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని పాటించాలంటూ కొత్త నిబంధనలతో కూడిన సర్క్యులర్ ని జారీ చేసింది.  ఫేస్ మాస్కులు ధరించడానికి నిరాకరిస్తున్న వారు, కోవిడ్ లక్షణాలున్నాయంటూ ఇతరులతో తగాదాలు పడేవారు, తమకు కేటాయించిన సీటులో కాకుండా మరో సీటులో కూర్చుంటామని విమాన సిబ్బందితో గొడవ పడేవారు పెరుగుతున్నారని ఈ శాఖ పేర్కొంది. ఈ విధమైన ప్రవర్తనతో ఇతరులను ఇబ్బంది పెట్టేవారి పట్ల సహనంతో ఎలా మెలగాలో, వారిని ఎలా బుజ్జగించాలో సిబ్బంది అవగాహన ఏర్పరచుకోవాలని, ఏ మాత్రం పరిస్థితి ‘ముదురుతున్నట్టు’ కనిపించినా.. పై అధికారులకు తెలియజేయాలని కోరింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us