కరోనాతో కానిస్టేబుల్ మృతి..
తెలంగాణలో కోవిడ్ బారిన పడి ఓ పోలీస్ కానిస్టేబుల్ మరణించిన సంఘటన కలచివేసింది. కానిస్టేబుల్ మృతిపై పోలీసు శాఖ, తెలంగాణ ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది.
దేశంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజూ 5 వేల కేసులు నమోదు అవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విలయతాండవం కొనసాగిస్తోంది. తెలంగాణలో కోవిడ్ బారిన పడి ఓ పోలీస్ కానిస్టేబుల్ మరణించిన సంఘటన కలచివేసింది. కానిస్టేబుల్ మృతిపై పోలీసు శాఖ, తెలంగాణ ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్కు చెందిన కానిస్టేబుల్ 2007 బ్యాచ్కు చెందిన దయాకర్ రెడ్డి (37)గా అధికారులు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం అతడు అనారోగ్యానికి గురికావడంతో టెస్ట్లు చేయగా, అతడికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే దయాకర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు.
కరోనా వైరస్ సోకి గత రాత్రి హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో దయాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ చనిపోయినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ పోలీస్ శాఖ అండగా ఉంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు.
[svt-event date=”21/05/2020,1:50PM” class=”svt-cd-green” ]
#PoliceConstableOfficer Dayakar Reddy a #Covid19FrontLineWarrior of @hydcitypolice died of #CoronaVirus last night @ GandhiHospital. My Heartfelt Condolences to the bereaved family members. The Govt & #TSPolice will standby & support the family in #TheHourOfDistress by all means. pic.twitter.com/6eybsLycfj
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) May 21, 2020
[/svt-event]