మానవాళికి ముప్పుగా మారింది మహమ్మారి కరోనా వైరస్. ఈ పేరు వింటేనే ఇప్పుడు ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా దీనికి మందు కొనుగొన్నారంటూ కొన్ని వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. దీంతో త్వరలోనే కరోనా సమస్య తీరుతుందని పలు రకాల వ్యాక్సిన్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. వీటిపై తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. ఇప్పటివరకూ దీనికి మందు కొనుగొనలేదని పేర్కొంది. కానీ ఈ వ్యాక్సిన్ కోసం పరిశోధనలు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నాయని WHO డైరెక్టర్ డాక్టర్ టెడ్రెస్ తెలిపారు.
కరోనా బాధితుల చికిత్సలో ఎదురవుతోన్న సవాళ్లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య ప్రతినిధులతో డబ్ల్యూహెచ్ఓ చర్చలు జరిపిందన్నారు. కరోనాను అరికట్టడానికి కావాల్సిన వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే కనీసం 18 నెలల సమయం పడుతుందని చెప్పారు. శరవేగంగా విస్తరిస్తోన్న వైరస్ ఆటకట్టించేందుకు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ను కనిపెట్టే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అలాగే మందును కనిపిపెట్టేందుకు చాలా దేశాలు ముందుకు వస్తున్నాయని టెడ్రోస్ పేర్కొన్నారు.
కాగా.. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు లక్షలు దాటింది. కోవిడ్-19 మహమ్మారి వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకు 6, 01,502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 27, 438 మంది చనిపోయారు. ఇప్పటివరకు లక్షా 33 వేల మంది పేషంట్లు కోలుకున్నారు. అమెరికాలో కరోనా సోకి చనిపోయిన వారి సంఖ్య 17 వందలు దాటింది. లక్షా నాలుగువేల మందికి పైగా పాజిటివ్ వచ్చింది. చైనాలో మూడు వేల మందికిపైగా చనిపోయారు. ఇటలీలో అయితే మరీ దారుణం.. తొమ్మిది వేలకు పైగా ప్రజలను కరోనా మహమ్మారి చంపేసింది. స్పెయిన్లో అయిదువేల మంది ఉసురు తీసుకుంది కరోనా. జర్మనీలో ఇంచుమించు నాలుగు వందల మంది చనిపోయారు.
ఇవి కూడా చదవండి: కరోనా అలెర్ట్: రోడ్లు శుభ్రం చేసిన వైసీపీ ఎమ్మెల్యే
పవన్పై మంచు హీరో షాకింగ్ కామెంట్స్
కోలుకున్న కోడి ధరలు.. లాక్డౌన్ ఉన్నా రేట్లు పైపైకి
కరోనా ఎఫెక్ట్.. డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టులుగా టమాటాలు..
కరోనా ఎఫెక్ట్: తన వల్ల ఊరికి ఏమీ కాకూడదని వృద్ధుడు ఆత్మహత్య
జబర్దస్త్లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు
వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన