షాకింగ్‌.. తాజాగా మరో ఐదుగురు పోలీసులకు పాజిటివ్..

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులకు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే ఢిల్లీలో దాదాపు ఐదు వందల మంది పోలీసులకు పైగా కరోనా సోకింది.

షాకింగ్‌.. తాజాగా మరో ఐదుగురు పోలీసులకు పాజిటివ్..
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2020 | 4:58 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇది చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా.. అన్ని వర్గాల ప్రజలతో పాటు.. రాజకీయ నాయకులను, పోలీసులను అందర్నీ తాకుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులకు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే ఢిల్లీలో దాదాపు ఐదు వందల మంది పోలీసులకు పైగా కరోనా సోకింది. అయితే వీరిలో మే5వ తేదీ నుంచి ఇప్పటి వరకు ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరు మరణించడం.. ఖాకీలను కలవరపెడుతోంది. ఇదిలావుంటే.. తాజాగా మరో ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 500 మంది సిబ్బందికి పైగా కరోనా పాజిటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు ఢిల్లీలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,834కి చేరింది. వీరిలో 8,746 మంది కరోనా నుంచి కోలుకోగా.. 523 మంది కరోనా బారినపడి మరణించారు. ఇక మిగతా వారు.. కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. మరికొందరు హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు.