‘కరోనా మంత్రం’ చెప్పిన బాలయ్య.. అలా చేస్తే కోవిడ్ రాదట!
సోమవారం నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం నియోజక వర్గంలో పర్యటించారు. హిందూపురంలో రూ.55 లక్షల విలువ చేసే కోవిడ్ పరికరాలను ప్రభుత్వ డాక్టర్లకు ఎమ్మెల్యే బాలకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సోకిందని ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. సరైన జాగ్రత్తలు పాటిస్తే...
సోమవారం నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం నియోజక వర్గంలో పర్యటించారు. హిందూపురంలో రూ.55 లక్షల విలువ చేసే కోవిడ్ పరికరాలను ప్రభుత్వ డాక్టర్లకు ఎమ్మెల్యే బాలకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సోకిందని ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. సరైన జాగ్రత్తలు పాటిస్తే.. కరోనా రాదని అన్నారు. ఒకవేళ వచ్చినా.. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అలాగే కరోనా నివారణకు మంత్రం చెప్పారు బాలకృష్ణ. ”ఎక్ష్ ఉమ్ స్వాహా” అనే మంత్రం చదివితే కరోనా వైరస్ రాదని వెల్లడించారు. కోవిడ్ నివారణకు మంత్రంతో పాటూ మందులు కూడా తీసుకోవాలని పేర్కొన్నారు.
అలాగే.. రాష్ట్రంలో అభివృద్ధి కంటే కక్ష సాధింపులు చర్యలే ఎక్కువ ఉన్నాయన్నారు. రాజధాని లేకున్నా టీడీపీ హయాంలో తెలంగాణ కన్నా అధిక ఆదాయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో అందరూ కలిస్తేనే అభివృద్ధి సాధ్యమని బాలకృష్ణ పేర్కొన్నారు. కష్ట కాలంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలన్నారు.
Read More:
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అప్డేట్.. పెద్ద సర్ప్రైజ్ మీకోసం
అమ్మాయిల వివాహ వయసు పెంచే ఆలోచనలో కేంద్రం
కోవిడ్తో టాలీవుడ్ నిర్మాత మృతి
బ్రేకింగ్: ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లీక్, వ్యక్తి మృతి