భారత్లో కరోనా.. గడిచిన 24 గంటల్లో 27,114 కేసులు, 519 మరణాలు..
భారత్లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 27,114 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి మొత్తంగా దేశంలో 8,20,916 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,83,407 యాక్టివ్ కేసులు ఉండగా 5,15,385 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు తాజాగా […]
భారత్లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 27,114 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి మొత్తంగా దేశంలో 8,20,916 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,83,407 యాక్టివ్ కేసులు ఉండగా 5,15,385 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు తాజాగా 519 మంది మరణించగా.. ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 22,123కు చేరింది.
ఎక్కువ కరోనా కేసులు ఈ రాష్ట్రాల్లోనే…
- మహారాష్ట్ర – 238461
- ఢిల్లీ – 109140
- తమిళనాడు – 130261
- గుజరాత్ – 40069
- ఉత్తరప్రదేశ్ – 33700
- కర్ణాటక – 33418
- తెలంగాణ – 32224
ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ కరోనా మరణాలు..
- మహారాష్ట్ర – 9893
- ఢిల్లీ – 3300
- గుజరాత్ – 2022
- తమిళనాడు – 1829
- ఉత్తరప్రదేశ్ – 889
Also Read:
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటికే ఉచితంగా కిట్లు పంపిణీ..
జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతీ జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్..!
తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్లో 30% కోత.!
భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..
ఏపీ ప్రజలకు గమనిక.. ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..