బీజేపీపై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఫైర్

బీజేపీ నేతలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ లో పార్టీ వ్యవహారాల ఇన్-ఛార్జ్ అజయ్ మాకెన్ మండిపడ్డారు. ఆ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకోసం దర్యాప్తు సంస్థలను వినియోగించుకుంటోందని..

బీజేపీపై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 01, 2020 | 4:07 PM

బీజేపీ నేతలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ లో పార్టీ వ్యవహారాల ఇన్-ఛార్జ్ అజయ్ మాకెన్ మండిపడ్డారు. ఆ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకోసం దర్యాప్తు సంస్థలను వినియోగించుకుంటోందని ఆరోపించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అందుకున్న విరాళాలపై ఈడీ ఇన్వెస్టిగేట్ చేయాలన్న బీజేపీ డిమాండును ప్రస్తావించిన ఆయన..రాజస్థాన్ లోను, ఇతర రాష్ట్రాలలోను కమలనాథులు తమ రాజకీయ ప్రయోజనాలకోసమే ఈడీని, సీబీఐని వినియోగించుకుంటున్నారని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. అటు-మెహుల్ చోక్సీ , రానా కపూర్, జిగ్నేష్ షా, జకీర్ నాయక్ వంటి వ్యక్తుల లావాదేవీలపై మనీ లాండరింగ్ కేసులు పెట్టి ఈడీ దర్యాప్తు జరుపుతోందని, వీరినుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి నిధులు, విరాళాలు అందాయని బీజేపీ తీవ్రంగా ఆరోపించింది. అయితే అజయ్ మాకెన్ వీటిని తేలిగ్గా కొట్టిపారేశారు.