ప్రముఖ టీవీ యాంకర్కు కరోనా పాజిటివ్
ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందికి సోకిన వైరస్..ప్రముఖులు, వీఐపీలను కూడా పట్టి పీడిస్తోంది. తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానెల్ యాంకర్కు కూడా కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది...
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలటం లేదు. దానికి ఎదురైన వారందరిపై పంజా విసురుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందికి సోకిన వైరస్..ప్రముఖులు, వీఐపీలను కూడా పట్టి పీడిస్తోంది. తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానెల్ యాంకర్కు కూడా కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది.
డ్రగన్ కంట్రీ చైనాలోని వుహన్లో పుట్టిన కోవిడ్-19 ప్రపంచాన్ని చుట్టేస్తోంది. దాదాపు 200 దేశాల చేరువగ ఎగబాకిన వైరస్ కారణంగా అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకుల వణికిపోతోంది. అమెరికాలో వైరస్ విలయ తాండవం చేస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ ఛానెల్ సీఎన్ఎన్ ప్రైమ్ టైమ్ న్యూస్ యాంకర్ క్రిస్ క్యూమోకు కరోనా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని మార్చి 31 ఆయనే స్వయంగా తన అధికారిక ట్విటర్లో వెల్లడించారు. మంగళవారం 9 pm ప్రోగ్రామ్లో క్రిస్ క్యూమో పాల్గొనాల్సి ఉండగా.. ఇంతలో ఈ విషయం బయటపడినట్లు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా ఆయన కరోనా రోగులతో కార్యక్రమాలు చేశారు. ఈ క్రమంలో వైరస్ బారిన పడటం చర్చనీయాంశంగా మారింది. కాగా, న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమోకు ఇతడు సోదరుడు.