విషాదం: పబ్జీ పిచ్చికి 14 ఏళ్ల బాలుడు బలి..
కరోనా లాక్డౌన్ కాలంలో పిల్లలు మరింతగా సెల్ఫోన్లు, సెల్ ఫోన్లలో ఉండే గేమ్స్కి బాగా అలవాటు పడిపోతున్నారు. మొబైల్స్ లో గేమ్స్ ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
పిల్లలు సెల్ఫోన్లకు అలవాటు పడకుండా చూడాలని మానసిక నిపుణులు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు. అయిన్నప్పటికీ కరోనా లాక్డౌన్ కాలంలో పిల్లలు మరింతగా సెల్ఫోన్లు, సెల్ ఫోన్లలో ఉండే గేమ్స్కి బాగా అలవాటు పడిపోతున్నారు. మొబైల్స్ లో గేమ్స్ ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో అటువంటిదే దారుణ సంఘటన చోటు చేసుకుంది. పబ్జీ గేమ్కు ఓ బాలుడు బలైపోయాడు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీనగర్ కాలనీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
పలమనేరు శ్రీనగర్ కాలనీకి చెందిన 14 ఏళ్ల బాలుడు టెన్త్ చదువుతున్నాడు. ఫోన్లో రోజూ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉండేవాడు..పబ్జీ గేమ్కు ఆ విద్యార్థి పూర్తిగా బానిసగా మారాడు. తండ్రి మొబైల్ తీసుకుని రోజంతా గేమ్లోనే మునిగి పోయేవాడు. ఈ క్రమంలో గేమ్ ఆడొద్దని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించే సరికి అతడు ఫ్యాన్కు వెళాడుతూ కనిపించాడు..వెంటనే అతన్ని కిందకు దింపి పలమనేరు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం తిరుపతికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బాలుడు చనిపోయినట్లుగా పలమనేరు పోలీసులు వెల్లడించారు.