జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ
విజయవాడ: రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులకు సంబంధించిన మరో జాబితాను జనసేన పార్టీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి నాలుగో జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు అనంతరం మంగళవారం మధ్యాహ్నం ఒక లోక్సభ, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి ఇటీవలే పార్టీలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నట్టు […]
విజయవాడ: రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులకు సంబంధించిన మరో జాబితాను జనసేన పార్టీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి నాలుగో జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు అనంతరం మంగళవారం మధ్యాహ్నం ఒక లోక్సభ, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి ఇటీవలే పార్టీలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నట్టు జనసేన ఓ ప్రకటనలో తెలిపింది. తొలుత భీమిలి నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చినా.. అనేక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో విశాఖ లోక్ సభ స్థానం నుంచి లక్ష్మీనారాయణను పోటీ చేయించాలని నిర్ణయించింది.
నాలుగో విడత జనసేన అసెంబ్లీ అభ్యర్థుల జాబితా.. విశాఖ నార్త్ – పసుపులేటి ఉషాకిరణ్ విశాఖ సౌత్ – గంపల గిరిధర్ విశాఖ ఈస్ట్ – కోన తాతారావు భీమిలి – పంచకర్ల సందీప్ అమలాపురం – శెట్టిబత్తుల రాజబాబు పెద్దాపురం – తుమ్మల రామస్వామి (బాబు) పోలవరం – చిర్రి బాలరాజు అనంతపురం – టి.సి.వరుణ్