
హైదరాబాద్, జులై 6: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు కీలక అప్డేట్ జారీ చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి త్వరలో మరో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 119 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ క్రమంలో ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ (CEN No.03/2026) పోస్టులకు సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. షార్ట్ నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 15 నుంచి మొదలవనుంది. ఆగస్టు 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా జులై 1, 2026వ తేదీ నాటికి వయోపరిమితి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
ఆర్ఆర్బీ రైల్వే ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఓబీసీ దివ్యాంగులకు 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ దివ్యాంగులకు 15 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.35,400 జీతంతోపాటు ఇతర అలవెన్స్లు అందుతుంది. దరఖాస్తు రుసుము కింద మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EBC) అభ్యర్థులు రూ.250, ఇతర జనరల్ అభ్యర్థులు రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. సీబీటీ పరీక్షకు హాజరైన వారికి రూ.400 రిఫండ్ చేస్తారు.
ఈ నోటిఫికేషన్తోపాటు జూన్ 30న వివిధ విభాగాల్లో మొత్తం 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 29వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతల కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేసే ఈ పోస్టులకు రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ఆర్ఆర్బీ రైల్వే ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.