Oil Prices Rising: రష్యా యుద్ధంతో భారత్ లో సామాన్యులపై ధరల భారం.. పెట్రో ధరలు ఎంతమేర పెరగనున్నాయంటే..

Updated on: Feb 25, 2022 | 3:01 PM

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు అనూహ్యంగా పెరిగాయి. మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధరలకు 100 డాలర్లకు చేరుకుంది.

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు అనూహ్యంగా పెరిగాయి. మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధరలకు 100 డాలర్లకు చేరుకుంది. పెరుగుతున్న ముడిచమురు ధరలు భారతదేశంలోని విధాన నిర్ణేతలకు తలనొప్పులు తీసుకువస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఆర్థిక వ్యవస్థపై ధరల పెరుగదల ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు.