
India Billionaires: భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వారు తమ నికర ఆస్తుల (Net Worth) విలువతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అయితే, ఈ బిలియనీర్లు ప్రతి నిమిషానికి ఎంత సంపాదిస్తున్నారో మీకు తెలుసా? ఊహకందని రేంజ్లో ఉండే వారి వార్షిక ఆదాయం, నిమిషానికి వచ్చే సంపాదన వివరాలు ఇవే:
సన్ ఫార్మా (Sun Pharma) వ్యవస్థాపకుడైన దిలీప్ సంఘ్వీ ఈ జాబితాలో నిమిషానికి అత్యధిక ఆదాయంతో ముందున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నికర ఆస్తుల పరంగా దేశంలోనే అత్యంత సంపన్నులలో ఒకరిగా ఉన్నారు.
అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడైన గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం వేగంగా విస్తరిస్తోంది.
ప్రముఖ ఐటీ సంస్థ హెచ్సిఎల్ టెక్ (HCL Tech) వ్యవస్థాపకుడైన శివ్ నాడార్ కూడా నిమిషానికి లక్షల్లోనే ఆర్జిస్తున్నారు.
డీమార్ట్ (D-Mart) సూపర్ మార్కెట్ చైన్ ద్వారా రిటైల్ రంగంలో విప్లవం తెచ్చిన రాధాకిషన్ దమానీ సంపాదన కూడా భారీ స్థాయిలోనే ఉంది.
సాధారణ ప్రజలు నెలంతా కష్టపడినా సంపాదించలేని మొత్తాన్ని ఈ బిలియనీర్లు కేవలం ఒక్క నిమిషంలోనే ఆర్జిస్తుండటం గమనార్హం. అయితే వీరి వ్యాపారాలు విస్తరిస్తున్నకొద్ది సంపాదన పెరుగుతుంటుంది.
ఇది కూడా చదవండి: Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి