అనర్హతపై సుప్రీంకు రెబల్ ఎమ్మెల్యే

| Edited By:

Jul 28, 2019 | 6:50 PM

కర్నాటక సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. స్పీకర్ రమేశ్‌కుమార్ 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇది చట్ట విరుద్దమని పేర్కొంటూ అనర్హతకు గురైన రెబల్ ఎమ్మెల్యే విశ్వనాథ్ సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. విశ్వనాథ్ జేడీ(ఎస్) పార్టీకి చెందిన ఎమ్మెల్యే. స్పీకర్ రమేశ్‌కుమార్ ముగ్గురు జేడీ(ఎస్), 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయంతో వీరంతా 2023 వరకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కును […]

అనర్హతపై సుప్రీంకు రెబల్ ఎమ్మెల్యే
Follow us on

కర్నాటక సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. స్పీకర్ రమేశ్‌కుమార్ 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇది చట్ట విరుద్దమని పేర్కొంటూ అనర్హతకు గురైన రెబల్ ఎమ్మెల్యే విశ్వనాథ్ సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. విశ్వనాథ్ జేడీ(ఎస్) పార్టీకి చెందిన ఎమ్మెల్యే. స్పీకర్ రమేశ్‌కుమార్ ముగ్గురు జేడీ(ఎస్), 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.

స్పీకర్ నిర్ణయంతో వీరంతా 2023 వరకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కోల్పోయినట్టుంది. దీంతో స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రియించినట్టుగా విశ్వనాథ్ తెలిపారు.