రాజమండ్రిలో ఈనెల 14న జనసేన ఆవిర్భావసభ

| Edited By:

Mar 07, 2019 | 7:34 PM

మార్చి 14న రాజమహేంద్రవరంలో జనసేన ఆవిర్భావ సభను నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. 2014 మార్చి 14న జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. ఐదో వార్షికోత్సవ సభను గోదారి గట్టున భారీ ఎత్తున నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లతో పాటు జనసమీకరణ కూడా చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. […]

రాజమండ్రిలో ఈనెల 14న జనసేన ఆవిర్భావసభ
Follow us on

మార్చి 14న రాజమహేంద్రవరంలో జనసేన ఆవిర్భావ సభను నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. 2014 మార్చి 14న జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. ఐదో వార్షికోత్సవ సభను గోదారి గట్టున భారీ ఎత్తున నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లతో పాటు జనసమీకరణ కూడా చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాజమహేంద్రవరం సభ ఓ తొలి అడుగు మాత్రమేనని, ఆ తర్వాత విశాఖ, విజయవాడ నగరాల్లో మరిన్ని సభలు ఉంటాయని జనసేన అధికార ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. రాజమహేంద్రవరంలో జనసేన సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 15 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి బొమ్మదేవర శ్రీధర్ నేతృత్వం వహించనున్నారు.