Bandi Sanjay Comments: మహబూబ్ నగర్ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేవారు. 2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం..
Bandi Sanjay Comments: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేవారు. 2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం నాడు మహబూబ్నగర్ జిల్లాలోని మరికల్ మండలం అప్పంపల్లిలో బండి సంజయ్ పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. గ్రామ గ్రామాల వివేకా నందుని విగ్రహాలను ప్రతిష్టించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తున్నారని, తాము ఏ మతాన్ని కించపర్చడం లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. అన్నింటిలోనూ దైవాన్ని చూసేదే హింధూ ధర్మం అని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో తూటాలు, తుపాకులు రాజ్యమేలుతున్నాయని వ్యాఖ్యానించారు. హిందూ ధర్మాన్ని కాపాడేదే బీజేపీ అని పేర్కొన్న బండి సంజయ్.. తెలంగాణలో రామరాజ్య స్థాపన కావాలని అన్నారు.
Also read:
జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసినా తగ్గని హీట్.. టీఆర్ఎస్ నాయకురాలి ఇంటిపై దుండగుల దాడి..