అయోధ్య తీర్పు ఎఫెక్ట్: ఆ బ్యాంక్లో అకౌంట్ ఉంటే బోనస్..
ఉత్తర్ప్రదేశ్ అలహాబాద్లో ‘రామ్ నామ్ బ్యాంక్’ ఉంది. ఈ బ్యాంక్ రూటే సెపరేట్. ఎందుకంటే అక్కడ డిపాజిట్ చేసేది రామ నామం. ఈ బ్యాంక్లో అకౌంట్ తీసుకున్న వాళ్లు..బుక్లెట్స్లో రామనామం, రామకోటి రాసి బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. తాజాగా అయోధ్య రాముడిదే అంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సదరు బ్యాంకు తన ఖాతాదారులకు బోనస్ ప్రకటించింది. ఇంతకీ బోనస్ ఏంటంటే: నవంబర్ 9-10 అర్ధరాత్రిలోపు కనీసం 1.25 లక్షల సార్లు రామనామాన్ని రాసి.. బ్యాంక్లో […]
ఉత్తర్ప్రదేశ్ అలహాబాద్లో ‘రామ్ నామ్ బ్యాంక్’ ఉంది. ఈ బ్యాంక్ రూటే సెపరేట్. ఎందుకంటే అక్కడ డిపాజిట్ చేసేది రామ నామం. ఈ బ్యాంక్లో అకౌంట్ తీసుకున్న వాళ్లు..బుక్లెట్స్లో రామనామం, రామకోటి రాసి బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. తాజాగా అయోధ్య రాముడిదే అంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సదరు బ్యాంకు తన ఖాతాదారులకు బోనస్ ప్రకటించింది.
ఇంతకీ బోనస్ ఏంటంటే:
నవంబర్ 9-10 అర్ధరాత్రిలోపు కనీసం 1.25 లక్షల సార్లు రామనామాన్ని రాసి.. బ్యాంక్లో డిపాజిట్ చేసిన అకౌంట్ హోల్డర్స్కు ఓ అవార్డ్ ఇవ్వనుంది ‘రామ్ నామ్ బ్యాంక్’. ఇప్పుడు ఒకసారి రామనామం రాస్తే..బ్యాంక్ ప్రకటించిన బోనస్ నేపథ్యంలో అది రెండుసార్లుగా పరిగణించబడుతుంది. వారు స్వదస్తూరితో రాసినా, కంప్యూటర్ లేదా మెబైల్ యాప్లో టైప్ చేసిన కూడా అది కౌంట్ చేయబడుతోంది. బ్యాంక్ ఇచ్చే బుక్లెట్లోనే వీటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇలా నిర్ణీత గడువులోపు ఎవరైతే టార్గెట్ కంప్లీట్ చేసి ఉంటారో వారికి..సర్టిఫికెట్ బహుకరించనుంది బ్యాంక్.
దీనిలో భాగంగా ఒక కోటి కంటే ఎక్కువసార్లు రామనామం ఎవరైతే రాసినట్టు తేలుతుందో వారికి అక్షవతి మార్గ్లోని సెక్టర్-1 లో ఉచిత వసతి కల్పించనున్నారు. ఇప్పటివరకు కోటి మార్కును.. 12 మంది దాటినట్టు బ్యాంకు నిర్వాహకులు గుర్తించారు. వీరందర్నీ 2020లో అలహాబాద్ సంఘం ప్రాంతంలో జరిగే మెగామేళాలో సత్కరిస్తారు.