ఏపీ సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు.. జరగనున్నాయిలా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఇటీవలే దరఖాస్తు గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో వీటి నిర్వహణపై పంచాయితీ రాజ్ కమిషనర్ మాట్లాడారు. ఈ పరీక్షల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున 1,33,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని.. వీటికి 22.73లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. ఇక సచివాలయ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 1 నుంచి పరీక్షలు ప్రారంభించి వారం రోజుల పాటు నిర్వహిస్తామని గిరిజా శంకర్ తెలిపారు. […]

ఏపీ సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు.. జరగనున్నాయిలా
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2019 | 3:54 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఇటీవలే దరఖాస్తు గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో వీటి నిర్వహణపై పంచాయితీ రాజ్ కమిషనర్ మాట్లాడారు. ఈ పరీక్షల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున 1,33,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని.. వీటికి 22.73లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. ఇక సచివాలయ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 1 నుంచి పరీక్షలు ప్రారంభించి వారం రోజుల పాటు నిర్వహిస్తామని గిరిజా శంకర్ తెలిపారు.

ప్రశ్నాపత్రాలు రెండు భాషల్లో ఉంటాయని.. టెక్నికల్ సబ్జెక్ట్ మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటాయని పేర్కొన్నారు. ఇక మొదటి రోజు 12 లక్షల 50వేల మంది పరీక్ష రాస్తారని చెప్పుకొచ్చారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6వేలకు పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సీసీటీవీ, వీడియో కవరేజ్ పెట్టి ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని.. మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు.

మరోవైపు పంచాయితీ, మున్సిపల్ శాఖలు కలిసి సమన్వయంతో సచివాలయ ఉద్యోగాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 22 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. 150ప్రశ్నలకు 150మార్కులుంటాయని.. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుందని తెలిపారు. ప్రతి 4 తప్పు సమాధానాలకు ఒక మార్కు నష్టపోతారని.. ఎవరైనా పోస్టుల విషయంలో అభ్యర్థులను మోసం చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని విజయ్ కుమార్ హెచ్చరించారు.