అర్థరాత్రి చెన్నైలో ఉద్రిక్తత.. ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ ముస్లింల ధర్నా..
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగ నిత్యం ఎక్కడో ఓ చోట ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి చెన్నైలో స్థానిక ముస్లిం మహిళలు, పురుషులు ధర్నాకు దిగారు. దీంతో అర్థరాత్రి చెన్నైలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ ముస్లిం మహిళలు రోడ్డు ధర్నాకు దిగారు. ధర్నాకు అనుమతిలేదని చెప్పినా పట్టించుకోకపోవడంతో పోలీసులు మహిళలపై లాఠీచార్చ్ చేశారు. దీంతో పోలీసులు మహిళలకు మధ్య.. కాసేపు తీవ్ర వాగ్వాదం నెలకొంది. అటు పోలీసులపైకి మహిళలు రాళ్ల […]
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగ నిత్యం ఎక్కడో ఓ చోట ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి చెన్నైలో స్థానిక ముస్లిం మహిళలు, పురుషులు ధర్నాకు దిగారు. దీంతో అర్థరాత్రి చెన్నైలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ ముస్లిం మహిళలు రోడ్డు ధర్నాకు దిగారు. ధర్నాకు అనుమతిలేదని చెప్పినా పట్టించుకోకపోవడంతో పోలీసులు మహిళలపై లాఠీచార్చ్ చేశారు. దీంతో పోలీసులు మహిళలకు మధ్య.. కాసేపు తీవ్ర వాగ్వాదం నెలకొంది. అటు పోలీసులపైకి మహిళలు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి. దీంతో ముస్లిం సంఘాలతో పోలీస్ ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని కోరారు.
Tamil Nadu: People stage protest against #CitizenshipAmendmentAct and National Register of Citizens (#NRC) at Pudupet in Chennai. pic.twitter.com/7W0Y3u5w9o
— ANI (@ANI) February 14, 2020
#WATCH: Scuffle broke out between Police & protestors who were demonstrating against Citizenship Amendment Act (CAA) and National Register of Citizens (NRC) at Washermanpet in Chennai, yesterday evening. Over 100 protestors have been detained. #TamilNadu pic.twitter.com/5YpiCN2tgw
— ANI (@ANI) February 14, 2020