ఏపీలో కొత్తగా ఎన్ని కేసులంటే ? జిల్లాల వారిగా వివరాలు..
ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 553 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇందులో రాష్ట్రానికి చెందిన కేసులు 477 ఉండగా, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందినవి 76గా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య
ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 553 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇందులో రాష్ట్రానికి చెందిన కేసులు 477 ఉండగా, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందినవి 76గా ఉన్నాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,783కి చేరింది. అందులో 4,817 యాక్టివ్ కేసులు ఉండగా, 3,830 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఏడుగురు మరణించగా మొత్తం మరణాల సంఖ్య 136కి చేరింది. కొత్తగా 118 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
ఇక ఏపీలో జిల్లాల వారిగా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య పరిశీలించినట్లయితే.. రాష్ట్రంలో స్థానికంగా 477 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో అనంతపురం జిల్లాలో 52 కేసులు, చిత్తూరులో 42 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 64, గుంటూరులో 67, కడపలో 22, కృష్ణాలో 47, కర్నూలులో 72, నెల్లూరులో 29, ప్రకాశంలో 18, శ్రీకాకుళంలో 1, విశాఖపట్నంలో 40, విజయనగరంలో 5, పశ్చిమ గోదావరి జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో 69 మందికి, ఇతర దేశాల నుండి వచ్చిన ఏడుగురికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యంది.