జగన్ సర్కార్ సిట్ ఏర్పాటు చేస్తూ సంచలన నిర్ణయం.. ఇక ఆ టార్గెట్ తప్పదా..!
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. 2014 నుంచి 2019 మధ్య నారా చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణకు ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో ఈ సిట్ ఏర్పాటైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత.. గత ప్రభుత్వ హయాంలో […]
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. 2014 నుంచి 2019 మధ్య నారా చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణకు ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో ఈ సిట్ ఏర్పాటైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత.. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగినట్లు అంచనాకు వచ్చింది. ముఖ్యంగా అమరావతిలో భూముల కొనుగోలు సహా.. పలు రంగాల్లో అవినీతి జరిగినట్టు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. గతంలో మంత్రివర్గ ఉప సంఘం సమర్పించిన నివేదికలోని అంశాలపై కూడా సిట్ విచారణ చేపట్టనుంది. సీఆర్డీఏ పరిధిలోని సరిహద్దుల మార్పు, అవకతవకలు, ఇన్సైడర్ ట్రేడింగ్, బినామీ లావాదేవీల ఆరోపణలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించనుంది.
అంతేగాక.. ఇతర ప్రాజెక్టుల్లోని అక్రమాల ఆరోపణలపైనా సిట్ విచారణ చేపట్టనుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులుగా ఐపీఎస్ అధికారులు అట్టాడ బాబూజీ, వెంకట అప్పలనాయుడు, శ్రీనివాస్రెడ్డి, జయరామ్రాజు, విజయ్ భాస్కర్, గిరిధర్, కెనడీ, శ్రీనివాసన్, ఎస్వీ రాజశేఖర్రెడ్డిలను నియమించింది. సిట్కు ప్రభుత్వం విస్తృతాధికారాలు కట్టబెడుతూ జీవో రిలీజ్ చేసింది. ఈ జీవోలో పేర్కొన్న ప్రకారం.. ఎవరినైనా విచారణకు పిలివడంతో పాటు ప్రశ్నించే అధికారం సిట్కు ఉందని పేర్కొంది. అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉంటే కేసులు నమోదు చేసి, చార్జ్ షీట్లు ఫైల్ చేసే అధికారం కూడా సిట్కు ఉంది.