అన్నయ్యకు ప్రేమతో.. కేటీఆర్కు రాఖీ కట్టిన కవిత
ప్రతీ సోదరుడు తన తోబుట్టువుకు అండగా ఉంటానని ప్రమాణం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు ఆయన సోదరి కవిత..
దేశ వ్యాప్తంగా రాఖీ పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అన్ని ఇళ్లల్లో రాఖీ పౌర్ణమి హడావిడి మొదలైంది. సోదరీమణులందరూ తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. అదే విధంగా ప్రతీ సోదరుడు తన తోబుట్టువుకు అండగా ఉంటానని ప్రమాణం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు ఆయన సోదరి కవిత రాఖీ కట్టారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ, కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ ఉన్నారు. కవితతో పాటు టీఆర్ఎస్ మహిళా టీఆర్ఎస్ నేతలు మంత్రి సత్యవతి రాథోడ్, లోక్సభ సభ్యురాలు మాలోతు కవిత, ఎమ్మెల్యే సునీత, పలువురు మంత్రి కేటీఆర్కు రాఖీ కట్టారు.
రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకొని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS గారికి రాఖీ కట్టిన మాజీ ఎంపీ శ్రీమతి @RaoKavitha గారు.#HappyRakshaBandhan pic.twitter.com/FDwWkqUN4S
— TRS Party (@trspartyonline) August 3, 2020
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS గారికి రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టిన మంత్రి శ్రీమతి @SatyavathiTRS, ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత, ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత, టిఆర్ఎస్ నాయకురాలు శ్రీమతి గుండు సుధారాణి, మరియు తదితరులు.#HappyRakhshaBandhan pic.twitter.com/UMYWet8Iet
— TRS Party (@trspartyonline) August 3, 2020
Read More:
ప్రియమైన సోదరీమణులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలుః సీఎం జగన్
ప్రపంచంపై కరోనా టెర్రర్.. ఉధృతంగా పెరుగుతోన్న పాజిటివ్ కేసులు