Y. S. Sharmila: జిల్లాల పర్యటనలో షర్మిల.. బస్సులో ప్రయాణికులతో ముచ్చట్లు.. వీడియో వైరల్

Edited By:

Updated on: Jan 23, 2024 | 1:31 PM

రోడ్డు మార్గంలో ఇచ్ఛాపురంలో వెళ్తున్న ఆమె మార్గ మధ్యలో ఆర్టీసీ బస్సు ఎక్కారు.. కంచలి మండలం బైరిపురం జంక్షన్‌ దగ్గర కాన్వాయ్‌ ఆపి ఆర్టీసీ బస్సులో ఎక్కారు..బస్సులోని ప్రయాణికులతో ముచ్చటిస్తూ ప్రయాణం సాగించారు.. వైఎస్ షర్మిల చేపట్టిన జిల్లాల పర్యటన నేడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమై..

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల జిల్లాల పర్యటన ప్రారంభమైంది..ఈ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం బయలుదేరారు షర్మిల.. రోడ్డు మార్గంలో ఇచ్ఛాపురంలో వెళ్తున్న ఆమె మార్గ మధ్యలో ఆర్టీసీ బస్సు ఎక్కారు.. కంచలి మండలం బైరిపురం జంక్షన్‌ దగ్గర కాన్వాయ్‌ ఆపి ఆర్టీసీ బస్సులో ఎక్కారు..బస్సులోని ప్రయాణికులతో ముచ్చటిస్తూ ప్రయాణం సాగించారు.. వైఎస్ షర్మిల చేపట్టిన జిల్లాల పర్యటన నేడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమై..ఈ నెల 31న కడప జిల్లాలో ముగుస్తుంది.

మరోవైపు ప్రజలు ఒక్క ఓటు వేయకపోయినా ఏపీలో బీజేపీ రాజ్యమేలుతుందన్నారు కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల. ఏపీలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బీజేపీకి ఊడిగం చేస్తున్నారన్నారు. రాహుల్ ప్రధాని అయితే మొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదాపైనే ఉంటుందన్నారు షర్మిల. ఈ నెల 31 వరకు నిర్వహించతలపెట్టిన జిల్లాల పర్యటనను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభించారామె..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Jan 23, 2024 01:12 PM
Loading...
Unable to load recommendations.
Follow Us