దుర్గమ్మను దర్శించుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్వహించనున్న అఖిల భారత ప్రచారక్‌ల సమావేశంలో పాల్గొనేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ విజయవాడ వచ్చారు.  ఈ క్రమంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో మోహన్‌ భగవత్‌, ఇతర ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులను సాదరంగా ఆహ్వానించారు. సంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారి దర్శనం చేసుకున్నారు. వేద పండితుల ఆశీర్వాదం అనంతరం ఆలయ అధికారి వి.కోటేశ్వరమ్మ వారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందించారు

దుర్గమ్మను దర్శించుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌
Follow us

|

Updated on: Jul 09, 2019 | 7:27 PM

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్వహించనున్న అఖిల భారత ప్రచారక్‌ల సమావేశంలో పాల్గొనేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ విజయవాడ వచ్చారు.  ఈ క్రమంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో మోహన్‌ భగవత్‌, ఇతర ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులను సాదరంగా ఆహ్వానించారు. సంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారి దర్శనం చేసుకున్నారు. వేద పండితుల ఆశీర్వాదం అనంతరం ఆలయ అధికారి వి.కోటేశ్వరమ్మ వారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందించారు

Latest Articles