2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!

AP Rains: రోజురోజుకూ సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోత, ఎండవేడిని జనాలు తాళలేకపోతున్నారు. మంగళవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.1 డిగ్రీలు, విజయనగరం జిల్లా జామిలో 44.9 డిగ్రీలు, వైయస్సార్ జిల్లా ఖాజీపేటలో 44.6 డిగ్రీలు, కర్నూలు జిల్లా వగరూరులో 44.2 డిగ్రీలు..

2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
Rains & Heat Wacve
Follow us

|

Updated on: Apr 23, 2024 | 6:10 PM

రోజురోజుకూ సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోత, ఎండవేడిని జనాలు తాళలేకపోతున్నారు. మంగళవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.1 డిగ్రీలు, విజయనగరం జిల్లా జామిలో 44.9 డిగ్రీలు, వైయస్సార్ జిల్లా ఖాజీపేటలో 44.6 డిగ్రీలు, కర్నూలు జిల్లా వగరూరులో 44.2 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరపల్లెలో 44.1 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 43.8 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా సారవకోట, అల్లూరి జిల్లా కొండైగూడెంలో 43.7 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా నాగంపల్లిలో 43.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 66 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 84 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. బుధవారం 46 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 143 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. ఎల్లుండి 47 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 109 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(46):-

శ్రీకాకుళం 13 , విజయనగరం 19 , పార్వతీపురంమన్యం 11 , అనకాపల్లి 3 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(143):-

శ్రీకాకుళం16 , విజయనగరం 6, పార్వతీపురంమన్యం 4, అల్లూరిసీతారామరాజు 9, విశాఖపట్నం 3, అనకాపల్లి 15, కాకినాడ 18, కోనసీమ 9, తూర్పుగోదావరి 19, పశ్చిమగోదావరి 4, ఏలూరు 12, కృష్ణా 6, ఎన్టీఆర్ 5, గుంటూరు 13, పల్నాడు 2, బాపట్ల 1, తిరుపతి జిల్లా గూడూరు మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.

చల్లటి వానలు.. అక్కడక్కడా..

తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి విస్తరించిందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు పడే అవకాశముంది.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?