తెలంగాణలో దుబ్బాక విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికలో గెలుపు తరహాలోనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీజీపీ భావిస్తుంది. వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ మరణం కారణంగా జరగనున్న ఈ ఉపఎన్నికలపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. తిరుపతి తిరుపతిలోని విజయం సాధించిన ఏపీలోనూ పాగావేయాలని బీజీపీ చూస్తుంది. ప్రజలను ఆకర్షించేందుకు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని శనివారం తిరుపతిలో నిర్వహించనున్నారు. ఇందుకోసం బీజేపీ ముఖ్యనేతలు తిరుపతికి రానున్నారు. ఈ సమావేశంలో తిరుపతి ఉపఎన్నికలపై కీలక చర్చ జరనున్నట్టు తెలుస్తుంది.