ఏపీలో తొలిసారి ఎట్ హోం కార్యక్రమం

| Edited By:

Aug 15, 2019 | 9:29 PM

ఏపీలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజ్‌భవన్‌లో గురువారం ఎట్ హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ .. అధికార,ప్రతిపక్షనేతలకు తేనీటి విందు ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారి ఏపీలో ఎట్‌ హోం కార్యక‍్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో పాటు స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. . వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, వసంతకృష్ణ ప్రసాద్‌, జోగి […]

ఏపీలో తొలిసారి  ఎట్ హోం కార్యక్రమం
Follow us on

ఏపీలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజ్‌భవన్‌లో గురువారం ఎట్ హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ .. అధికార,ప్రతిపక్షనేతలకు తేనీటి విందు ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారి ఏపీలో ఎట్‌ హోం కార్యక‍్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో పాటు స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. . వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, వసంతకృష్ణ ప్రసాద్‌, జోగి రమేష్‌, టీడీపీ నేతలు కళా వెంకట్రావు, ఏంపీ కనకమేడల రవీంద్ర, అశోక్‌ బాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, దిలీప్‌, అడపా నాగేంద్ర, చాగర్లమూడి గాయత్రి, సీపీఐ నేతలు రామకృష్ణ, జల్లి విల్సన్‌, పలువురు ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు, నగర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.