Andhra Pradesh: ఈ పెన్నుకు మొక్కలు పుడతాయి.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు

|

Jul 30, 2022 | 7:26 PM

ఈ పెన్నుతో.. మొక్కలు మొలుస్తాయ్‌.. అదేంటి వింతగా ఉంది అనుకుంటున్నారా. ఇది మంచి కాజ్ కోసమే. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Andhra Pradesh: ఈ పెన్నుకు మొక్కలు పుడతాయి.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Seeds Pen
Follow us on

Seed pens: మనసుంటే మార్గముటుంది. మంచి పని చేయాలంటే కాస్త మొదడుకు పదును పడితే సరిపోతుంది. అందులో భాగంగానే వచ్చిన ఓ ఎకో ఫ్రెండ్లీ(eco friendly) పెన్ ఇప్పడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎంత కాస్ట్లీ పెన్ అయినా.. ఇంక్ అయిపోతే పక్కన పడేస్తారు. కాస్త పొదుపు చేసేవారు మాత్రం రిఫిల్స్ మారుస్తూ 2, 3 సార్లు వినియోగిస్తారు. ఆ తర్వాతైనా వాటిని పడేయాల్సిందే. కాగా చాలావరకు పెన్నులను ప్లాస్టిక్‌తోనే తయారుచేస్తారు. దీంతో ఎంతోకొంత మేర పర్యావరణానికి హాని జరుగుతుంది. అందుకు చెక్ పెట్టేందుకు అనంతపురానికి(Anantapur) చెందిన AGS ఓ సరికొత్త ఎకో ఫ్రెండ్లీ పెన్నుతో ముందుకుకొచ్చింది. నగరంలో ప్లాస్టిక్ బ్యాన్ చేసిన నేపథ్యంలో ఈ ట్రస్ట్ వారు స్పెషల్ పెన్స్ గవర్నమెంట్స్ స్కూల్స్‌లో డిస్టిబ్యూట్ చేస్తున్నారు. పేపర్‌తో వీటిని తయారు చేయించారు. ఈ పెన్నుకు ఒక వైపు రాసుకునేందుకు వీలుగా పిన్ ఉంటుంది. మరోవైపు అంటే పెన్ పై భాగంలో నేలలో కలిసిపోయే తత్వం ఉన్న ఓ క్యాప్సుల్ అమర్చారు. అందులో టమాటా, మిరపతో పాటు వంగ విత్తనాలను ఉంచారు. పెన్నులో ఇంక్ అయిపోగానే పడేస్తే.. ఆ పెన్‌ మట్టిలో కలిసిపోయి.. క్యాప్సిల్‌లోని విత్తనాలు వల్ల మొక్కలు మొలుస్తాయి. ప్రజంట్ ఈ పెన్నులను నగరంలో విరివిగా పంపిణీ చేస్తుంది AGS ట్రస్ట్. మనకి ఎంతో ఇచ్చిన నేచర్‌ కోసం.. మనం ఈ మాత్రం చేయలేమా చెప్పండి.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..