Sajjala : భట్టరాజుల సమావేశంలో చంద్రబాబుపై సజ్జల హాట్ కామెంట్స్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు నిజమైన సాధికారత కల్పించారని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు...
Bhattarajula meeting – Sajjala Ramakrishna Reddy : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు నిజమైన సాధికారత కల్పించారని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజాసంక్షేమం కోసం సీఎం జగన్ నిరంతరం శ్రమిస్తున్నారని సజ్జల చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన భట్ట రాజులు కులస్తుల రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు.
కొత్తగా నామినేటెడ్ పదవులకు ఎన్నికైన వారు సంక్షేమ పథకాలను కింద స్థాయి వరకు తీసుకెళ్లాలని సజ్జల ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బీసీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తను అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడూ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని సజ్జల ఆరోపించారు.
తాడేపల్లిలో జరిగిన భట్ట రాజులు కులస్తుల రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నవరత్నాల పథకం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Read also : Revanth Reddy : ఇంద్రవెళ్లి గడ్డమీద లక్ష మందితో దండు కట్టి దళిత, గిరిజన దండోరా మోగిస్తాం : రేవంత్ రెడ్డి