AP Rains – CM Jagan: వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండండి.. అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు..

చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో జల విలయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అత్యవసర రివ్యూ నిర్వహించారు. వరద సహాయక చర్యలపై అసెంబ్లీ చాంబర్‌లో కలెక్టర్లు, అధికారులతో..

AP Rains - CM Jagan: వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండండి.. అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు..
Cm Jagan
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 22, 2021 | 12:17 PM

చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో జల విలయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అత్యవసర రివ్యూ నిర్వహించారు. వరద సహాయక చర్యలపై అసెంబ్లీ చాంబర్‌లో కలెక్టర్లు, అధికారులతో సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులుకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.  అధికారులతో సీఎం జగన్ మాట్లాడుతూ.. వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని ఆదేశించారు. వారిపట్ల మానవతా దృక్పథాన్ని చూపించండని సూచించారు. తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఉదారత చూపించాలన్నారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంటనూనె, కేజీ ఉల్లి, కేజీ పొటాటో, రూ.2వేలు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాన్ని, వార్డును యూనిట్‌గా తీసుకోవాలని.. వాలంటీర్ల సేవలను వినియోగించుకుని ప్రతి ఇంటికీ సహాయం అందాలని పేర్కొన్నారు.

ముంపునకు గురైన ప్రతి ఇంటికీ ఈ పరిహారం అందాలన్నారు. ఎవ్వరికీ అందలేదన్న మాట రాకూడదని.. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి మంచి వసతులు, సదుపాయాలు కల్పించలని తెలిపారు. వారికి అందించే సేవల్లో ఎక్కడా లోటు రానీయకూడదని.. ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట వినిపించాలి అధికారులకు హెచ్చరించారు.

పునరావస కేంద్రాల నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కుటుంబానికి రూ.2వేలు ఇవ్వాలని సూచించారు. విద్యుత్‌పునరుద్ధరణ, రక్షిత తాగునీటిని అందించడం యుద్ధ ప్రాతిపదికన జరగాలన్నారు. దీనికిమీద ప్రత్యేక దృషిపెట్టాలన్నారు.

ఇప్పుడు వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు డిజైన్లు రూపొందించి శాశ్వత పనులు చేపట్టాలన్నారు. వచ్చే నాలుగు వారాల్లో టెండర్లను ఖరారుచేసి.. పనులు మొదలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్‌ విభాగాలు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇళ్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా వారికి వెంటనే నగదు ఇవ్వాలన్నారు. పూర్తిగా ఇళ్లు ధ్వంసం అయిన వారికి రూ. 95,100 డబ్బు ఇవ్వాలని..  దీంతోపాటు ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు వెంటనే మంజూరుచేయండని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. దీనివల్ల వెంటనే పనులు మొదలుపెట్టగలుగుతారు. పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ. 5200 నగదు వెంటనే అందించేలా చూడాలన్నారు.

ప్రాణాలు కోల్పోయిన వారికి ఇప్పటికే 90శాతం మేర నష్టపరిహారం అందించారు. మిగిలిన వారికి వెంటనే అందించేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు తోడుగా నిలవండని సూచించారు.

నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్‌కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి, ఆర్టీసీ కండక్టర్‌ కుటుంబానికి తోడుగా ఉండండి. వారికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోండి. ఆ కుటుంబాల పట్ల ఉదారంగా ఉండండి. రూ.25 లక్షల పరిహారం వారి కుటుంబాలకు అందించండి విపత్తులో సహాయం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు కాబట్టి.. మిగిలిన వారిలో ధైర్యం నింపాడానికే ఈ చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కలెక్టర్లకు సూచించారు.

చెరువులు, ఇతర జలాశయాలు, గట్టుమీద దృష్టిపెట్టాలన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండండాలని.. ఎప్పటికప్పుడు వారు నివేదికలను అధికారులకు అందించాలన్నారు.. అయితే బంగాళాఖాతంలో మళ్లీ వస్తున్న అల్పపీడనం తమిళనాడు దక్షిణ ప్రాంతానికి వెళ్తున్నట్టు చెప్తున్నారు. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశం.

ఇవి కూడా చదవండి: Fashion Tips : ఈ 3 రకాల బట్టలు కొంటున్నారా..అయితే మీరు డబ్బు వెస్ట్ చేసుకుంటున్నట్లే.. అవేంటో మీకు తెలుసా..

Republic Day 2022: రిపబ్లిక్ డే వేడుకలకు బిమ్స్‌టెక్ నాయకులు.. పాక్, చైనా కుట్రలను తిప్పికొట్టేందుకే అంటున్న విశ్లేషకులు..