అరటితోటలో వెళుతుండగా వింత శబ్ధాలు.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె ఆగిపోయేలా ఆకారం..! వీడియో ఇదిగో..

Anantapur Python: అనంతపురం జిల్లా యల్లనూరు మండలం దంతెరపల్లిలో అరటి తోటలో 15 అడుగుల భారీ కొండచిలువ కలకలం రేపింది. పామును చూసిన కూలీలు, రైతు భయంతో పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్ మధుసూదన్ రెడ్డి అతి కష్టం మీద కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

అరటితోటలో వెళుతుండగా వింత శబ్ధాలు.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె ఆగిపోయేలా ఆకారం..! వీడియో ఇదిగో..
Anantapur Python

Edited By:

Updated on: Aug 08, 2026 | 8:46 PM

భారీ కొండచిలువ చూసి అరటి తోటలో పని చేస్తున్న కూలీలు పరుగులు పెట్టారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం దంతెరపల్లి గ్రామంలో అరటి తోటలో భారీ కొండ చిలువను కూలీలు గుర్తించారు. భాస్కర్ రెడ్డి అనే అరటి రైతు తోటలో కొండచిలువ… అందర్నీ పరుగులు పెట్టించింది. అంత పెద్ద కొండచిలువను చూసి కూలీలతో పాటు.. రైతు భాస్కర్ రెడ్డి, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంత పెద్ద పామును చూసి అంతా షాకయ్యారు.

అరటి తోటలో తిష్ట వేసుకుని కూర్చున్న భారీ కొండచిలువను పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ మధుసూదన్ రెడ్డిని పిలిపించాడు అరటి తోట యజమాని భాస్కర్ రెడ్డి. దాదాపు 15 అడుగుల పొడవు ఉన్న భారీ కొండచిలువను అతి కష్టం మీద పట్టుకున్నారు. కొండచిలువను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా… స్నేక్ క్యాచర్ మధుసూదన్ రెడ్డికి ఆ భారీ కొండచిలువ చుక్కలు చూపించింది. ఎట్టకేలకు కొండ చిలువను పట్టుకొని.. దగ్గర్లో ఉన్న అటవీ ప్రాంతంలోకి వదలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us