ఆస్ట్రేలియా వెళ్లిన ఎయిర్‌ ఇండియా ఫైలట్‌కు కరోనా పాజిటివ్

ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లిన ఎయిర్‌ ఇండియా పైలట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫ్లైట్ ఎక్కే ముందు జరిపిన పరీక్షల్లో అతడికి నెగిటివ్‌గా ఉన్నప్పటికీ..

ఆస్ట్రేలియా వెళ్లిన ఎయిర్‌ ఇండియా ఫైలట్‌కు కరోనా పాజిటివ్
Follow us

| Edited By:

Updated on: Jun 23, 2020 | 2:47 PM

ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లిన ఎయిర్‌ ఇండియా పైలట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫ్లైట్ ఎక్కే ముందు జరిపిన పరీక్షల్లో అతడికి నెగిటివ్‌గా ఉన్నప్పటికీ.. ఆ తరువాత పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ల్యాండ్ అయిన తరువాత పైలట్‌తో పాటు కాక్ పిట్‌లో ఉన్న మరో ఇద్దరు సిబ్బందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.

ఈ విషయంపై ఎయిర్ ఇండియా సంస్థ మాట్లాడుతూ.. విమానయానానికి సిద్ధమయ్యే పైలట్‌లకు తాము ముందుగానే పరీక్షలు చేస్తామని, ఆ క్రమంలో ఈ నెల 16న జరిపిన పరీక్షల్లో అతడికి నెగిటివ్‌గా వచ్చిందని తెలిపారు. దాంతో విమానాన్ని నడిపేందుకు ఈ నెల 20న సదరు పైలట్‌కు అవకాశం ఇచ్చామని అన్నారు. అంతేకాకుండా ఆ పైలట్ మామూలుగా లాగోస్‌కి వెళ్లాలని కానీ సిడ్నీకి వెళ్లే పైలట్‌కి బాలేకపోవడంతో.. లాగోస్‌కి వెళ్లాల్సిన ఈ పైలట్‌ని సిడ్నీకి పంపినట్లు తెలిపారు. అయితే ఎయిర్‌ ఇండియాలో ఇలా జరగడం ఇది రెండో సారి. గత నెల 30న ఢిల్లీ నుంచి మాస్కోకు వెళ్లిన పైలట్‌కు కరోనా వచ్చిందని తెలీడంతో.. మార్గమాధ్యమంలోనే అతడు వెనక్కి రావాల్సి వచ్చిన విషయం తెలిసిందే.

Read This Story Also: వారందరికి నూటికి నూరు శాతం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాల్సిందే: సీఎం జగన్

Latest Articles
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..