ప్రధాని మోదీ అలా పిలుపునివ్వడం చాలా గ్రేట్ .. హీరో అమీర్ఖాన్
పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన డిస్పోజబుల్ ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని ఆపేయాలన్న ప్రధాని మోదీకి పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. బాలీవుడ్ హీరో అమీర్ఖాన్ ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని తాను ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపాడు. ప్రధాని ఆలోచనకు తన సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందన్నాడు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తప్పకుండా ఆపేస్తానంటూ ట్వీట్ చేశాడు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. ఒక్కసారి […]
పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన డిస్పోజబుల్ ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని ఆపేయాలన్న ప్రధాని మోదీకి పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. బాలీవుడ్ హీరో అమీర్ఖాన్ ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని తాను ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపాడు. ప్రధాని ఆలోచనకు తన సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందన్నాడు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తప్పకుండా ఆపేస్తానంటూ ట్వీట్ చేశాడు.
మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. ఒక్కసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని మానేద్దాం అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు మోదీ తెలిపారు.
The initiative by the Hon’ble PM @narendramodi to curb ‘single use plastic’ is an effort all of us should strongly support. It’s up to each of us to make sure we stop using ‘single use plastic’.
— Aamir Khan (@aamir_khan) August 26, 2019