‘అగ్రి’ బాధితులకు జగన్ గుడ్ న్యూస్.. ఈసారి తానే స్వయంగా..!

ప్రభుత్వంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామన్న మాటను చకాచకా నిలబెట్టుకుంటున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తొలి విడతగా పదివేల రూపాయల కంటే తక్కువగా వున్న బాధితులకు డబ్బులు తిరిగి ఇచ్చేసిన సీఎం.. రెండో విడతలో 20 వేల రూపాయల కంటే తక్కువ వున్న వారికి డబ్బులు పంపిణీ చేయించారు. మూడో విడతలో తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు సీఎం జగన్. నవంబర్ 7న గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించి తానే స్వయంగా అగ్రి […]

‘అగ్రి’ బాధితులకు జగన్ గుడ్ న్యూస్.. ఈసారి తానే స్వయంగా..!
Follow us

|

Updated on: Nov 04, 2019 | 5:19 PM

ప్రభుత్వంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామన్న మాటను చకాచకా నిలబెట్టుకుంటున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తొలి విడతగా పదివేల రూపాయల కంటే తక్కువగా వున్న బాధితులకు డబ్బులు తిరిగి ఇచ్చేసిన సీఎం.. రెండో విడతలో 20 వేల రూపాయల కంటే తక్కువ వున్న వారికి డబ్బులు పంపిణీ చేయించారు.
మూడో విడతలో తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు సీఎం జగన్. నవంబర్ 7న గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించి తానే స్వయంగా అగ్రి గోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు జగన్. ఇందులో భాగంగా ముఖ్యమైన పనులను గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు సుచరిత, మోపిదేవి వెంకట రమణ, రంగనాథ్ రాజులకు అప్పగించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆదేశాలను అందుకున్న ముగ్గురు మంత్రులు సోమవారం నాడు గుంటూరులో జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్యమైన వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించారు.
బహిరంగ సభ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు. సభకు జనసమీకరణ, బాధితుల రాకపోకలకు ఏర్పాట్లు వంటి వాటిపై చర్చలు జరిపారు. ఏది ఏమైనా ఏళ్ళ తరబడి తమ డిపాజిట్ల కోసం ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు నిజంగా ఇది శుభవార్తే.