తాలిబన్ల దాడిలో నలుగురు పోలీసులు మృతి
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. చర్బౌలిక్ జిల్లాలో ఆఫ్ఘన్ జవాన్లకు, తాలిబన్ ఫోర్స్కు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో నలుగురు ఆఫ్ఘన్ జవాన్లను తాలిబన్లు...
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. చర్బౌలిక్ జిల్లాలో ఆఫ్ఘన్ జవాన్లకు, తాలిబన్ ఫోర్స్కు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో నలుగురు ఆఫ్ఘన్ జవాన్లను తాలిబన్లు చంపేశారు. బాల్క్ గవర్నర్ అధికార ప్రతినిధి మునీర్ అహ్మద్ ఫర్హాద్ తెలిపిన వివరాల ప్రకారం.. చర్బౌలిక్ జిల్లాలోని పియాజ్కర్ గ్రామంలో తాలిబన్లు ఆఫ్ఘన్ జవాన్లపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా తాలిబన్లు ఎలాంటి ప్రకటన చేయలేదు.