కశ్మీర్‌లో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం..

ఓవైపు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్‌లో మాత్రం దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మూడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అది కూడా ముక్కుమొఖం తెలియని వ్యక్తి కాదు.. ఆ చిన్నారి పొరుగింటికి చెందిన ఓ పద్దెనిమిదేళ్ల యువకుడు. ఈ ఘటన రాంబన్ జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లాకు చెందిన ఓ మూడేళ్ల చిన్నారి.. బుధవారం నాడు.. ఇంటి బయట ఆడుకుంటుండగా.. పక్క […]

కశ్మీర్‌లో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం..
Follow us

| Edited By:

Updated on: Apr 09, 2020 | 10:07 PM

ఓవైపు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్‌లో మాత్రం దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మూడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అది కూడా ముక్కుమొఖం తెలియని వ్యక్తి కాదు.. ఆ చిన్నారి పొరుగింటికి చెందిన ఓ పద్దెనిమిదేళ్ల యువకుడు.

ఈ ఘటన రాంబన్ జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లాకు చెందిన ఓ మూడేళ్ల చిన్నారి.. బుధవారం నాడు.. ఇంటి బయట ఆడుకుంటుండగా.. పక్క ఇంట్లో ఉంటే ఓ పద్దెనిమిదేళ్ల యువకుడు.. ఆ చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ అభంశుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. అయితే ఆ చిన్నారి ఏడ్పులు వినిపిస్తుండటంతో.. ఆమె తల్లి వెంటనే అక్కడికి వెళ్లి చూసింది. అప్పటికే ఆ చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆ చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.