బెంగళూరులో ఇద్దరు నైజీరియన్లు అరెస్ట్.. కొకైన్ స్వాధీనం
కర్ణాటకలో సోమవారం నాడు ఇద్దరు నైజీరియన్లను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి 14.5 గ్రాముల కోకైన్ను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన క్రైం బ్రాంచ్ జాయింట్ కమిషనర్..
కర్ణాటకలో సోమవారం నాడు ఇద్దరు నైజీరియన్లను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి 14.5 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన క్రైం బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్ ఈ విషయాన్ని తెలిపారు. సంపిగెహల్లీలోని అగ్రహార ప్రాంతంలో యాంటీ నార్కోటిక్ వింగ్ చేపట్టిన తనిఖీల్లో ఈ నైజిరియన్లు పట్టుబడ్డారని.. వారిద్దరూ బిజినెస్ వీసాపై భారత్కు వచ్చారని తెలిపారు. వారి వద్ద నుంచి రెండు బైక్లు,మూడు ఫోన్లు, ఓ వెయింగ్ మిషన్ను స్వాధీనంచ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ దాదాపు రూ.3 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన ఇద్దర్ని క్రిస్టియన్ ఓజెమెనా కిమెరే, ఓకోన్క్వో బెంజిమెన్ చుక్వుడిగా గుర్తించారు. వీరిద్దరు కొకైన్ను ఇతరులకు అమ్ముతున్నట్లు గుర్తించారు.
2 drug peddlers were arrested on 10th August after 14.5 grams cocaine worth Rs 3 lakhs was recovered from them during a raid by Anti-Narcotics Wing in Agrahara area of Sampigehalli. Arrested Nigerian nationals were on a business visa: Sandeep Patil, Joint CP, Crime, Bengaluru pic.twitter.com/UNIciMTiPY
— ANI (@ANI) August 11, 2020
Read More :