క‌రోనా టెర్ర‌ర్ః ప్ర‌పంచ వ్యాప్తంగా కోటి 70 ల‌క్ష‌ల‌కు చేరుకున్న కోవిడ్ కేసులు..

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య 1,71,89,755కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 6,70,256 మంది కోవిడ్‌తో మ‌ర‌ణించారు. ప్రస్తుతం 58,18,358 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,07,01,141 మంది కోవిడ్ నుంచి కోలుకుని..

క‌రోనా టెర్ర‌ర్ః ప్ర‌పంచ వ్యాప్తంగా కోటి 70 ల‌క్ష‌ల‌కు చేరుకున్న కోవిడ్ కేసులు..
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2020 | 11:21 AM

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ప‌లువురు సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖులు, పోలీసులు, వైద్యులు ఈ వైర‌స్ బారిన ప‌డుతోన్న‌ విష‌యం తెలిసిందే. కాగా ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య 1,71,89,755కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 6,70,256 మంది కోవిడ్‌తో మ‌ర‌ణించారు. ప్రస్తుతం 58,18,358 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,07,01,141 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్ర‌స్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 45,68,037కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 1,53,840 మంది మృతి చెందారు. అలాగే 21,69,153 యాక్టీవ్ కేసులు ఉండగా, 22,45,044 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి.

అలాగే భారత్​లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. క‌రోనా కేసుల్లో ప్ర‌పంచంలో 3వ స్థానానికి చేరింది ఇండియా. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 52,123 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,83,792కి చేరింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5,28,242 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 10,20,582 మంది ఆస్ప్రతుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 775 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కోవిడ్ మ‌హ‌మ్మారి బారిన‌పడి 34,968 మంది మరణించారు.

Read More: 

తెలంగాణ జైళ్ల శాఖ‌లో క‌రోనా క‌ల‌కలం.. ఏకంగా 18 కేసులు..