Watch Video: పంటపొలాల్లో ఏనుగుల దండు బీభత్సం.. భయాందోళనలో గ్రామస్థులు..
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఎస్ గొల్లపల్లిలో అర్థరాత్రి వేళ పంట పొలాల్లోకి వచ్చి చేతికొచ్చిన పంటను నాశనం చేశాయి. ఈ మధ్య కాలంలో అడవీ మృగాలు, వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చి స్థానికులను కలవరపెడుతున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో పంటపొలాల్లో కాపలా ఉండేందుకు కూడా రైతులు జంకుతున్నారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఎస్ గొల్లపల్లిలో అర్థరాత్రి వేళ పంట పొలాల్లోకి వచ్చి చేతికొచ్చిన పంటను నాశనం చేశాయి. ఈ మధ్య కాలంలో అడవీ మృగాలు, వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చి స్థానికులను కలవరపెడుతున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో పంటపొలాల్లో కాపలా ఉండేందుకు కూడా రైతులు జంకుతున్నారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నారు. పచ్చగా పండించిన పంటలను తొక్కుతూ, తింటూ ఇలా నాశనం చేయడంతో పాటు బిందు సేద్య పరికరాలను ధ్వంసం చేస్తున్నాయి ఏనుగుల దండు. దీనిపై అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు రైతులు. ఈ అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు ఇలా జనావాసాల్లో, పంటపొలాల్లో ప్రత్యక్షం కావడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు తమ పరిస్థితిని అర్థం చేసుకుని ఏనుగుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు గ్రామస్థులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..