ఎంత ఘోరం.. ? వివస్త్రను చేసి వీడియో
హనుమకొండ జిల్లాలో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో ఒక మహిళను వివస్త్రను చేసి చిత్రవధ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తప్పు చేశానని బాధిత మహిళ ఎంత వేడుకున్నా గ్రామస్తులు వినకుండా దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తాటికాయల గ్రామానికి చెందిన యువతితో మునుగు మండలం, బోలోల్లు పల్లెకి చెందిన రాజుకి వివాహం జరిగింది. కాగా రాజు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పది రోజుల క్రితం ఈ జంట గ్రామం నుంచి పారిపోయారు. అయితే వీరిద్దరినీ గాలించి పట్టుకొచ్చిన రాజు కుటుంబ సభ్యులు తాటికాయల గ్రామానికి తీసుకొచ్చి అరగుండుగీయించారు. తర్వాత బాధిత మహిళను వివస్త్రను చేసి ఇనుప చెట్టుకు కట్టేసి ఆమె జననాంగాలపై జీడి పోసి చిత్రవధకు గురిచేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ఘటనతో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. యువతి యువకులు తప్పు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కాదని ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు.
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

