ఎంత ఘోరం.. ? వివస్త్రను చేసి వీడియో
హనుమకొండ జిల్లాలో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో ఒక మహిళను వివస్త్రను చేసి చిత్రవధ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తప్పు చేశానని బాధిత మహిళ ఎంత వేడుకున్నా గ్రామస్తులు వినకుండా దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తాటికాయల గ్రామానికి చెందిన యువతితో మునుగు మండలం, బోలోల్లు పల్లెకి చెందిన రాజుకి వివాహం జరిగింది. కాగా రాజు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పది రోజుల క్రితం ఈ జంట గ్రామం నుంచి పారిపోయారు. అయితే వీరిద్దరినీ గాలించి పట్టుకొచ్చిన రాజు కుటుంబ సభ్యులు తాటికాయల గ్రామానికి తీసుకొచ్చి అరగుండుగీయించారు. తర్వాత బాధిత మహిళను వివస్త్రను చేసి ఇనుప చెట్టుకు కట్టేసి ఆమె జననాంగాలపై జీడి పోసి చిత్రవధకు గురిచేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ఘటనతో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. యువతి యువకులు తప్పు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కాదని ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు.
అర్థరాత్రి రైడ్తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

