ఎంత ఘోరం.. ? వివస్త్రను చేసి వీడియో
హనుమకొండ జిల్లాలో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో ఒక మహిళను వివస్త్రను చేసి చిత్రవధ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తప్పు చేశానని బాధిత మహిళ ఎంత వేడుకున్నా గ్రామస్తులు వినకుండా దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తాటికాయల గ్రామానికి చెందిన యువతితో మునుగు మండలం, బోలోల్లు పల్లెకి చెందిన రాజుకి వివాహం జరిగింది. కాగా రాజు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పది రోజుల క్రితం ఈ జంట గ్రామం నుంచి పారిపోయారు. అయితే వీరిద్దరినీ గాలించి పట్టుకొచ్చిన రాజు కుటుంబ సభ్యులు తాటికాయల గ్రామానికి తీసుకొచ్చి అరగుండుగీయించారు. తర్వాత బాధిత మహిళను వివస్త్రను చేసి ఇనుప చెట్టుకు కట్టేసి ఆమె జననాంగాలపై జీడి పోసి చిత్రవధకు గురిచేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ఘటనతో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. యువతి యువకులు తప్పు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కాదని ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు.
ఇందూరు నయాగర జలపాతం ఎప్పుడైనా చూశారా?
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా!
స్కూటీలో భారీ పాము..భయంతో జనం పరుగులు
పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!

