Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటు

Updated on: Mar 27, 2025 | 5:12 PM

ఇకపై పార్లమెంట్‌లో ఎంపీలంతా ఇకపై అరకు కాఫీని టేస్ట్‌ చెయ్యొచ్చు.. ఇందుకోసం సోమవారం క్యాంటీన్ సంగం-1లో అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ప్రారంభించారు.. కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువల్ ఓరం, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడితోపాటు కూటమి ఎంపీలంతా అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అవకాశం ఇవ్వడంతో… పార్లమెంట్‌ ఆవరణలో సోమవారం నుంచి అరకు కాఫీ స్టాల్‌ అందుబాటులోకి వచ్చింది. 2 కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద ఈ స్టాల్స్ ఏర్పాటు చేశారు.. అరకు కాఫీ స్టాల్‌ను ఎంపీలు ఈటల, కొండా, పురంధేశ్వరి తదితరులు సందర్శించారు. కాఫీ స్టాల్స్‌ ప్రారంభం కోసం రెండ్రోజుల ముందే గిరిజన కోఆపరేటివ్‌ సొసైటీ అధికారులు ఢిల్లీకి వెళ్లారు. ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా అక్కడే ఉన్నారు. అరకు కాఫీకి ఈ స్థాయి గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏపీ గిరిజనుల కష్టాన్ని ప్రపంచం గుర్తించబోతున్నందుకు గర్వంగా కూడా ఉందని తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దారుణం.. ట్రైన్‌లో ప్రయాణిస్తున్న యువతిపై..

భర్త సొమ్ముతో ప్రియుడితో కలిసి బెట్టింగులు.. చివరికి..

రేషన్‌కార్డుదారులకు.. రేవంత్‌ సర్కార్‌ గుడ్ న్యూస్‌

విద్యార్ధులకు గుడ్‌ న్యూస్‌.. స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్నిరోజులంటే..?

Varun Tej: ఆ ట్రెండ్‌ను పట్టుకున్న వరుణ్ తేజ్‌.. మరి ఇలాగైనా సక్సెస్ అవుతారా