ప్రపంచంలోనే ఎత్తయిన ఉమియా దేవి ఆలయం ప్రత్యేకతలు ఏంటంటే

Updated on: Sep 21, 2025 | 2:51 PM

ప్రపంచంలోనే అతిఎత్తైన హిందూ ఆలయాల్లో ఉమియా దేవి మందిరం ఒకటి. గుజరాత్​లోని జాస్​పూర్​లో 60 ఎకరాల్లో 1000 కోట్ల రూపాయల బడ్జెట్​తో ఈ మందిర నిర్మాణం జరుగుతోంది. ఈ ఉమియా దేవి మందిరాన్ని విశ్వ ఉమియా ఫౌండేషన్‌ నిర్మిస్తోంది. దేశంలోనే అతిపెద్ద కాంక్రీట్ రాఫ్ట్​గానూ ఇది నిలవనుంది. ఈ ఆలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద రాఫ్ట్‌, భారత్‌లో తొలిసారిగా నిర్మితమవుతోంది.

సుమారు 24,000 ఘన మీటర్లు కాంక్రీట్ వినియోగించారు. రాఫ్ట్ కాస్టింగ్‌లో ఉపయోగించిన కాంక్రీట్‌తో 27 కి.మీ పొడవైన రహదారిని నిర్మించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆలయం 504 అడుగుల ఎత్తులో నిర్మితమవుతుందని విశ్వ ఉమియా ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఆర్​పీ పటేల్ తెలిపారు. దీనిని ప్రపంచంలోనే 9వ అద్భుతంగా పరిగణిస్తారని అన్నారు. విశ్వ ఉమియా ధామ్ మొత్తం సనాతన ధర్మానికి ప్రతీక అని తెలిపారు. ఇది అన్ని వర్గాలకు ఒక ధామ్​ గా నిలుస్తుందని తెలిపారు. మరోవైపు ప్రపంచపు అతి ఎత్తైన హిందూ ఆలయంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 700 అడుగుల ఎత్తైన వృందావన్ చంద్రోదయ మందిర్‌ను ఇస్కాన్‌ నిర్మిస్తోంది. ప్రస్తుతం అతి ఎత్తైన హిందూ టెంపుల్‌గా కర్ణాటకలో 249 అడుగుల మురుదేశ్వర్ ఆలయం ఉంది. దేశంలోనే అత్యంత పెద్ద రాజగోపురంగా ప్రసిద్ధి చెందింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టిక్కెట్ లేకుండా రైలు ఎక్కొచ్చు.. కానీ?

ఫైబర్‌ సప్లిమెంట్లతో సమస్యలు తప్పవు!

బుడిపెలున్న చేపను చూసారా

ట్యాంక్‌లో ఇరుక్కున్న ఏనుగు.. ఎలా కాపాడారో చూడండి

ఎలుగుబంటికి కూల్‌ డ్రింక్‌ ఇచ్చిన యువకుడు.. తర్వాత ఏమైందంటే