ఇంట్లో పనిచేసే బాలికపై యజమాని చిత్రహింసలు.

|

Dec 13, 2023 | 12:51 PM

ఇంట్లో పనిచేసే బాలికూ చిత్రహింసలకు పాల్పడింది యజమానురాలు. అంతేకాదు, ఆమె కుమారులు కూడా బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో బాధిత బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన గురుగావ్‌లో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన ఓ మహిళ తనకు తెలిసిన వారి ద్వారా తన 13 ఏళ్ల కూతురిని గురుగావ్‌లోని సెక్టార్ 57లో ఉండే శశి శర్మ ఇంట్లో పనికి పెట్టింది. నెలకు 9000 రూపాయల జీతానికి ఒప్పందం కుదుర్చుకుంది.

ఇంట్లో పనిచేసే బాలికూ చిత్రహింసలకు పాల్పడింది యజమానురాలు. అంతేకాదు, ఆమె కుమారులు కూడా బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో బాధిత బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన గురుగావ్‌లో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన ఓ మహిళ తనకు తెలిసిన వారి ద్వారా తన 13 ఏళ్ల కూతురిని గురుగావ్‌లోని సెక్టార్ 57లో ఉండే శశి శర్మ ఇంట్లో పనికి పెట్టింది. నెలకు 9000 రూపాయల జీతానికి ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి రెండు నెలలు అంతా బాగానే ఉందని, తరువాత యజమానులతో ఇబ్బందులు మొదలయ్యాయని చెప్పింది. కూతురిని చూసేందుకు వెళ్లినా వాళ్లు కలవనిచ్చే వారు కాదని పేర్కొంది. ఇటీవల ఓ రోజు కూతురిని చూసేందుకు శశి ఇంటికి వెళ్లగా ఆ చిన్నారి ఓ గదిలో బందీగా కనిపించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె నోటికి టేపు వేశారని, రెండు రోజులకు ఒకసారి మాత్రమే ఆహారం పెట్టేవారని ఆరోపించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొసలి నోట్లో చిక్కుకున్న కోతి పిల్ల.. హ్యాపీగా ఆహారం తింటూ ఎంజాయ్

Ranbir Kapoor: అలాంటి వారికి.. రణ్బీర్ సీరియస్ వార్నింగ్

Ram Gopal Varma: ఇదెక్కడి మాస్ వార్నింగ్ రా.. మామ

Tripti Dimri: అర్రె.. తృప్తికి పెద్ద కష్టమే వచ్చి పడిందే.. అందరూ అలా పిలిస్తే ఎలా ??

సీఎం రేవంత్‌ రెడ్డికి యంగ్ డైరెక్టర్ బహిరంగ లేఖ

 

Follow us on