స్కూలుకి లేట్‌గా వచ్చారని టాయ్‌లెట్స్‌ కడిగించిన ప్రిన్సిపల్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

|

Sep 14, 2022 | 8:45 PM

విద్యార్థులు తెలిసో తెలియక తప్పు చేస్తే వాటిని సరిదిద్ది మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది. వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించి, అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులే ఒక్కోసారి దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

విద్యార్థులు తెలిసో తెలియక తప్పు చేస్తే వాటిని సరిదిద్ది మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది. వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించి, అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులే ఒక్కోసారి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పనిష్మెంట్ పేరుతో క్రూరంగా ప్రవరిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వైరల్ గా మారింది. స్కూలుకు ఆలస్యంగా వచ్చారన్న కారణంతో ఓ ప్రిన్సిపాల్‌ విద్యార్ధులతో మరగుదొడ్లు కడిగించాడు. సరిగ్గా క్లీన్ చేయకుంటే స్కూలుకి తాళం వేస్తానని హెచ్చరించాడు. దీంతో గత్యంతరం లేక పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులతో చీపురు, బ్రష్ పట్టుకుని టాయిలెట్లు శుభ్రం చేశారు విద్యార్ధులు. ఉత్తర ప్రదేశ్‌లోని బలియా జిల్లా పిప్రా గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. అక్కడి పాఠశాలలో పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడంతో ప్రిన్సిపల్ విద్యార్థులతో వాష్‌రూమ్‌లను శుభ్రం చేయించాడు. అంతే కాదు వారి పక్కనే నిలబడి సూచనలు ఇస్తూ టాయిలెట్లు కడిగించాడు. సరిగా క్లీన్‌ చేయకుంటే తాళం వేస్తానని, అప్పుడు అందరూ ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. ఈ వ్యవహారమంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. దాంతో ఈ విషయం కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు తీవ్రంగా స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రిన్సిపల్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మబాబోయ్.. పిడుగు పడటాన్ని కళ్లారా ఎప్పుడైనా చూశారా ?? వీడియో చూస్తే గుండె గల్లంతే

Digital News Round Up: ఊపేస్తున్న తార్‌మార్‌ సాంగ్‌ | రష్మికను దించేసిన చిన్నారి..లైవ్ వీడియో

TOP 9 ET News: స్పై యాక్షన్ డ్రామా ది ఘోస్ట్ 12 యాక్షన్ సీన్స్ |పొన్నియన్ సెల్వన్ నుంచి సాంగ్ విడుదల

Follow us on