కడుపు నొప్పితో అస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే చూసి డాక్టర్లు షాక్ !!

Updated on: Aug 27, 2022 | 9:55 AM

ఓ వ్యక్తి కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చాడు. ఏం జరిగిందో ఏంటో చెప్పకపోవడం.. వైద్యులు ఎక్స్‌రే తీయించుకోవాలని సూచించారు.

ఓ వ్యక్తి కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చాడు. ఏం జరిగిందో ఏంటో చెప్పకపోవడం.. వైద్యులు ఎక్స్‌రే తీయించుకోవాలని సూచించారు. వైద్యపరీక్షల అనంతరం వచ్చిన ఎక్స్‌రే రిపోర్ట్ చూసిన డాక్టర్లు ఒక్కసారి ఖంగుతిన్నారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన కృష్ణ రౌత్ కడుపు ఉబ్బిపోయి.. విపరీతమైన నొప్పితో ఎంకేసీజీ ఆసుపత్రికి వచ్చాడు. వెంటనే డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. అతడి పేగుల్లో గ్లాసు ఉండటాన్ని చూసి షాక్‌ అయ్యారు. అది అసలు ఎలా వెళ్లిందా అని కృష్ణ రౌత్‌ను అడగ్గా మొదట పొంతలేని సమాధానాలు ఇచ్చాడు. ఆ తర్వాత డాక్టర్లు రెట్టించి అడగ్గా అసలు విషయం బయటపట్టాడు. 10 రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నానని.. ఆ సమయంలో మద్యం మత్తులో తాను పడి ఉంటే.. తన స్నేహితులు మలద్వారం నుంచి స్టీల్ గ్లాస్ జొప్పించారని చెప్పాడు. నొప్పి భరించలేనంతగా ఉండటంతో ఆస్పత్రికి వచ్చానని మొత్తం విషయాన్ని వెల్లడించాడు. కాగా, దాదాపు రెండు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి స్టీల్ గ్లాస్‌ను బయటికి తీశారు వైద్యులు. కాగా, ప్రస్తుతం కృష్ణ రౌత్ కోలుకుంటున్నాడని.. అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు.. మధుమేహానికి చెక్‌ ఇంకా ఎన్నో

Viral: తప్పతాగి యువతి హల్చల్‌.. సెక్యూరిటీ గార్డుపై దాడి

ఎండలో నిద్రపోయిన బ్యూటిషన్.. ప్లాస్టిక్‌లా మారిపోయిన ఆమె చర్మం

యువకుడికి ఘోర అవమానం !! చెప్పుతో కొడుతూ వీడియో తీస్తూ..

స్టూడెంట్‌ను కిడ్నాప్‌ చేసిన యువతి.. ఈ హనీట్రాప్‌ ఎలా జరిగిదంటే

 

Published on: Aug 27, 2022 09:55 AM