మధ్యప్రదేశ్‌లో మరో దారుణం.. యువకులను అర్ధనగ్నంగా మార్చి

Updated on: Jul 27, 2023 | 9:27 PM

మధ్యప్రదేశ్‌లో దారుణాలు కొనసాగుతున్నాయి. ఇటీవల సిద్ధి జిల్లాలో ఓ దళితుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన మరువక ముందే మొన్న ఓ వ్యక్తితో పాదాలు నాకించారు. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మధ్యప్రదేశ్‌లో దారుణాలు కొనసాగుతున్నాయి. ఇటీవల సిద్ధి జిల్లాలో ఓ దళితుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన మరువక ముందే మొన్న ఓ వ్యక్తితో పాదాలు నాకించారు. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముగ్గురు వ్యక్తులను అర్ధనగ్నంగా మార్చి కిందపడేసి, కర్రలతో చితకబాదారు కొందరు వ్యక్తులు. దెబ్బలకు తాళలేక బాధితులు ఆర్తనాదాలు చేశారు. దాదాపు ఏడుగురు వ్యక్తులు వారిని విచక్షణ రహితంగా చావబాదుతుంటే చుట్టూ గుమికూడిన వారు ప్రోత్సహించారు తప్ప ఎవరూ వారిని వారించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us