ఆడపిల్ల పుట్టిందని నా భర్త పట్టించుకోవడం లేదు !! న్యాయం చేయండి !!
ఆధునిక యుగంలోనూ లింగ వివక్ష తప్పడం లేదు. మహిళలు అన్ని రంగాల్లోనూ ఎంతగానో రాణిస్తున్నారు. పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. అయినా మహిళలకు వివక్ష తప్పడం లేదు. తాజాగా ఓ వ్యక్తి ఆడపిల్ల పుట్టిందని భార్యను పుట్టింట్లో వదిలేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. బాధిత మహిళ న్యాయం కోసం భర్త ఇంటిముందు నిరసనకు దిగింది.బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం..
ఆధునిక యుగంలోనూ లింగ వివక్ష తప్పడం లేదు. మహిళలు అన్ని రంగాల్లోనూ ఎంతగానో రాణిస్తున్నారు. పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. అయినా మహిళలకు వివక్ష తప్పడం లేదు. తాజాగా ఓ వ్యక్తి ఆడపిల్ల పుట్టిందని భార్యను పుట్టింట్లో వదిలేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. బాధిత మహిళ న్యాయం కోసం భర్త ఇంటిముందు నిరసనకు దిగింది.బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామానికి చెందిన శిరీషకు, శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన బొంగొని ప్రవీణ్ కుమార్ తో 2017 మే 19న వివాహం జరిగింది. వీరికి 2018 లో తనుశ్రీ అనే పాప జన్మించింది. అప్పటినుంచి తన భర్త తనను పట్టించుకోవడం లేదని, అదనపు కట్నం తేవాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. అంతేకాకుండా మరో మహిళతో సహజీవనం చేస్తూ తనను నిర్లక్ష్యం చేస్తూ కాపురానికి తీసుకుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెకు స్థానిక మహిళలు అండగా నిలిచారు. కేశవపట్నం పోలీసులు శిరీషను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీరు ప్రవహిస్తుండగానే గేటు ఏర్పాటు !! ఇంజినీరింగ్ సాహసమే !!
నాలుక రంగు ఆధారంగా 98% వ్యాధి నిర్థారణ
మైక్రో ఓవెన్లో వేడిచేసిన ఆహారం తింటున్నారా ?? మీకో షాకింగ్ న్యూస్ !!
మహిళ చితాభస్మంలో కత్తెర.. అసలేం జరిగింది?
నిండా ముంచిన ఇన్స్టా ప్రేమ..
ఇళ్లలో ఉక్కపోత.. బీచ్లో హాయినిద్ర! ప్రజల వినూత్న పరిష్కారం వైరల్
వీపుపై భార్య.. న్యాయం కోసం పోరాటం!
క్యాన్లలో పెట్రోల్ నింపి.. బైక్లకు కట్టుకుని..
ఇంట్లో నుంచి పారిపోయిన జంటకు హైకోర్టులో షాక్
సముద్రంలో శ్మశానవాటిక.. ఎవరిదో తెలుసా!

