AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడపిల్ల పుట్టిందని నా భర్త పట్టించుకోవడం లేదు !! న్యాయం చేయండి !!

ఆడపిల్ల పుట్టిందని నా భర్త పట్టించుకోవడం లేదు !! న్యాయం చేయండి !!

Phani CH
|

Updated on: Aug 16, 2024 | 9:09 PM

Share

ఆధునిక యుగంలోనూ లింగ వివక్ష తప్పడం లేదు. మహిళలు అన్ని రంగాల్లోనూ ఎంతగానో రాణిస్తున్నారు. పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. అయినా మహిళలకు వివక్ష తప్పడం లేదు. తాజాగా ఓ వ్యక్తి ఆడపిల్ల పుట్టిందని భార్యను పుట్టింట్లో వదిలేసిన ఘటన కరీంనగర్‌ జిల్లాలో జరిగింది. బాధిత మహిళ న్యాయం కోసం భర్త ఇంటిముందు నిరసనకు దిగింది.బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం..

ఆధునిక యుగంలోనూ లింగ వివక్ష తప్పడం లేదు. మహిళలు అన్ని రంగాల్లోనూ ఎంతగానో రాణిస్తున్నారు. పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. అయినా మహిళలకు వివక్ష తప్పడం లేదు. తాజాగా ఓ వ్యక్తి ఆడపిల్ల పుట్టిందని భార్యను పుట్టింట్లో వదిలేసిన ఘటన కరీంనగర్‌ జిల్లాలో జరిగింది. బాధిత మహిళ న్యాయం కోసం భర్త ఇంటిముందు నిరసనకు దిగింది.బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామానికి చెందిన శిరీషకు, శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన బొంగొని ప్రవీణ్ కుమార్ తో 2017 మే 19న వివాహం జరిగింది. వీరికి 2018 లో తనుశ్రీ అనే పాప జన్మించింది. అప్పటినుంచి తన భర్త తనను పట్టించుకోవడం లేదని, అదనపు కట్నం తేవాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. అంతేకాకుండా మరో మహిళతో సహజీవనం చేస్తూ తనను నిర్లక్ష్యం చేస్తూ కాపురానికి తీసుకుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెకు స్థానిక మహిళలు అండగా నిలిచారు. కేశవపట్నం పోలీసులు శిరీషను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీరు ప్రవహిస్తుండగానే గేటు ఏర్పాటు !! ఇంజినీరింగ్‌ సాహసమే !!

నాలుక రంగు ఆధారంగా 98% వ్యాధి నిర్థారణ

మైక్రో ఓవెన్‌లో వేడిచేసిన ఆహారం తింటున్నారా ?? మీకో షాకింగ్‌ న్యూస్‌ !!

iSmart News: బ్యాంక్ మేనేజర్ చెంపలు వాయించిన లీడర్ !!